*పదవీ విరమణ వయసు పెంపు పరిశీలనకు మంత్రుల కమిటీ*
అమరావతి, ఆగస్టు 29:
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుండి 65 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ, మానవ వనరుల అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉన్నారు.
*ఈ కమిటీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి, నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది.*